29/12/2023
టిటిడి సత్రాలను కొట్టడం కన్నా మరొచోట కట్టండిటీటీడీ ధర్మకర్తల మండలికి,అధికారులకు నవీన్ కుమార్ డిమాండ్ టిటిడి "సత్రాలను కొట్టడం కన్నా మరొచోట కట్టండి"... నవీన్ కుమార్ రెడ్డి
టీటీడీ ధర్మకర్తల మండలికి,అధికారులకు నవీన్ డిమాండ్
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల కొరకు డి అర్ మహల్ వద్ద దాతల టీటీడి సహకారంతో నిర్మించిన ఒకటవ, రెండవ సత్రాలను కొట్టేసి సుమారు 300 కోట్లతో నూతన వసతి సముదాయాలను నిర్మించే ఆలోచనను టీటీడీ ఉపసంరించుని "జూ"పార్క్ రోడ్ లో నిర్మిస్తే తిరుమల వెళ్లే యాత్రికులకు సౌకర్యంగా ఉంటుందనీ అలాగే D.R Mahal రైల్వే under bridge వద్ద ఆ పరిసర ప్రాంతాలలో నివసించే ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు వుండవని, అత్యవసరంగా ఆ పరిసర ప్రాంతాల నుంచి ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ కు వెళ్ళే అంబులెన్స్ లు ట్రాఫిక్ లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు!
EIA- (Emivironmental Impact Assessment) and SIA - (Social Impact Assessment) mandatory as per norms for high area buildings వారి అనుమతి తీసుకున్నారా లేదా? టీటీడీ అధికారులు చెప్పాలన్నారు!
డి.అర్ మహల్ వద్దగల రైల్వే అండర్ బ్రిడ్జి కింద వర్షా కాలంలో ఎలా వర్షపు నీరు ఉంటుందో నగర ప్రజలందరికీ తెలిసిన విషయమే !
టీటీడి యాత్రికుల సౌకర్యార్థం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తున్నాం కానీ DR మహల్ వద్ద వున్న గోవిందరాజ సత్రాల నిర్మాణం ఇప్పటికీ చెక్కుచెదరకుండా టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు రెగ్యులర్ గా annual maintenance నిర్వహిస్తున్నారని అవసరమైతే సత్రాలలోని రూములను renovations చేసి,మరుగు దొడ్లను ఆధునికరిస్తే సామాన్య పేద భక్తులకు అనుకూలంగా వుంటుందన్నారు!
గోవిందరాజ సత్రాలలో నార్త్ ఇండియా తో సహా ఇతర రాష్ట్రాలనుంచి బస్ ల ద్వారా,టెంపో ట్రావెల్స్ వాహనాలలో గుంపులుగా వచ్చే భక్తులు సత్రాల ప్రాంగణంలో వంటలు వండుకొని, భోజనాలు చేసి సత్రాలలోని రూమ్ లలో 10 మందికి పైగా అద్దే చాపలతో పడుకుంటారని అలాంటి వారికి నూతనంగా నిర్మించే వసతి సముదాయాలు ఉపయోగపడవన్నారు!
గోవిందరాజ సత్రాల నిర్మాణం చాలా పటిష్టంగా వుందని దానికన్నా ముందు బ్రిటిష్ కాలంలో నిర్మించిన "ఎస్వీ హై స్కూల్" "ఓల్డ్ హుజూర్ ఆఫీస్" లాంటివి ఆనేక భవనాలు తిరుపతిలో చెక్కు చెదరకుండా వున్నాయని అవసరమైతే "చెన్నై ఐఐటీ" నిపుణులచే సత్రాలను పరిశీలించి ప్రత్యామ్నాయంగా మౌలిక సదుపాయాలను కల్పించి శ్రీవారి సొమ్ము వృదా కాకుండా,సామాన్య భక్తులకు అసౌకర్యం కలుగకుండా అధికారులు పునరాలోచన చేయాలన్నారు!
గోవిందారాజ స్వామి సత్రాల నిర్మాణంలో ఆ కాలంలో వినియోగించిన అరుదైన కలపతో చేసిన తలపులు,కిటికీలు వెల కట్టలేనివన్నారు!
టీటీడీ ధర్మ కర్తల మండలి,అధికారులు తీసుకొనే నిర్ణయాలు భగవంతునితో సహా శ్రీవారి భక్తులు,స్థానికులు మెచ్చు కునేలా ఉండాలని పదికాలాల పాటు నిలవాలన్నారు!
టీటీడీ గోవిందరాజ సత్రాలను కొట్టేసి కొత్తవి నిర్మించే ఆలోచనను విరమించుకోనేలా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు అధికారులకి, ధర్మకర్తల మండలికి మంచి ఆలోచన కల్పిస్తారని నవీన్ ఆశాభావం వ్యక్తంచేశారు
ఓం నమో వేంకటేశాయ గోవిందా🙏
నవీన్ కుమార్ రెడ్డి
శ్రీవారి భక్తులు
రాయలసీమ పోరాట సమితి కన్వీనర్